అమెరికాలోని భారతీయులకు తీపి కబురు..!
- April 15, 2020
అమెరికా:కరోనా వైరస్తో అమెరికా అల్లాడుతోంది. ప్రధానంగా అక్కడి సాఫ్ట్వేర్ రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో చాలా కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది భారతీయులు.. అమెరికాలో చిక్కుకుపోయారు. వీరందరికీ ఊరటనిచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. తన వెబ్సైట్లో నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ క్రైసిస్ సమయంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామంది. ఈ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తుదారుడు సమర్పించాలని నోటిఫికేషన్లో తెలిపింది.
కోవిడ్-19 పరిణామాలతో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని, గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇండియా విజ్ఞప్తిపై స్పందించిన అమెరికా ప్రభుత్వం... ఈ నిర్ణయం తీసుకుంది. వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు... గడువు పొడిగింపు లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా బహిష్కరణ లాంటి పరిణామాలు కలగకుండా చూసుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే.. వారు అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







