త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జైలుపాలయ్యాడు: పాకిస్థాన్
- January 27, 2016
భారత దేశ వ్యాప్తంగా మంగళవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. స్కూల్లు, కాలేజీలు, కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అయితే పాకిస్థాన్లో ఓ వ్యక్తి కూడా తన ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. భారత క్రికెటర్ మీదున్న తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. కానీ.. ఆ అభిమానమే.. ఇప్పుడతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రావిన్స్లోని ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తికి భారత క్రికెటర్ విరాట్కోహ్లి అంటే అభిమానం. నిన్న భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్లో కోహ్లి అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన ఉమర్.. తన ఇంటిపై భారతీయ జెండాను ఎగురవేశాడు. అయితే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అతడి ఇంటిపై దాడి చేసి.. జెండాను, కోహ్లి ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ను అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. అయితే దీనిపై ఉమర్ మాట్లాడుతూ.. తాను కేవలం కోహ్లి అంటే అభిమానంతోనే అలా చేశానని.. తానేమీ గూఢచారిని కాదని, దేశద్రోహిని అంతకన్నా కాదని చెప్పాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని వదిలిపెట్టాలని కోరుతున్నాడు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









