కోవిడ్ 19: వైరస్ నేపథ్యంలో మినిస్ట్రి నిబంధనలు పాటించి 3 ఖతార్ కంపెనీలపై చర్యలు
- April 16, 2020
దోహా:కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ఖతార్ ప్రభుత్వం..కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించటంతో పాటు..కార్మికులను తరలించే బస్సుల్లో పూర్తి సామార్ధ్యంలో 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించింది. అయితే పెర్ల్ లోని మూడు నిర్మాణరంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు కార్మిక, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. బస్సుల్లో కార్మికులను మూకుమ్మడిగా తరలిస్తున్నారని, అలాగే పని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించకుండా ఎక్కువమందిని పనికి పురమాయించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పూర్తి విఘాతం కలిగించేలా నిర్మాణ సంస్థలు వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల తరలింపు, పని పురమాయింపు విధులను పర్యవేక్షించే ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







