అబుధాబి: కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు

- April 17, 2020 , by Maagulf
అబుధాబి: కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు

అబుధాబి: కరోనా కట్టడికి యావత్ ప్రపంచం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. గల్ఫ్ లో కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సదరు ప్రభుత్వాలు కోరుతున్నాయి. అబుధాబి లోని కార్మికుల సంరక్షణ కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందుబాటులో ఉంచుతోంది. సమాజం యొక్క ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా అబుధాబి లోని ముస్సాఫాలో కార్మికుల కోసం ప్రత్యేక  క్లినిక్‌లు ఏర్పాటు చేసారు. వీటిలో కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తారు.

మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, లేదా దగ్గు, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వైరస్ లక్షణాలను ప్రదర్శించేవారు క్లినిక్‌లలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సిఫారసు చేశారు. రెసిడెన్సీ వీసా లేనివారు సైతం ఈ పరీక్షలు చేయించుకునేందుకు ఎటువంటి నిబంధనలు లేవని అధికారులు ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com