సీసీసీకి నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం
- April 18, 2020
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోన్న కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. షూటింగ్లు లేక ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినందనీయమనీ, అందులో తనూ భాగం కావాలనే ఉద్దేశంతో తన వంతుగా ఈ విరాళం అందిస్తున్నాననీ ఆయన చెప్పారు. కరోనా ఉధృతిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయనీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా తమ విధులను అహర్నిశలూ నిర్వహిస్తున్నారనీ ఆయన కొనియాడారు. అలాగే ఈ విపత్కర పరిస్థితుల్లో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమించడం గొప్ప విషయమని మోహన్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి తగ్గట్లు పౌరులుగా మనందరం మన ఇళ్లల్లోనే క్షేమంగా ఉంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మన వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు