సీసీసీకి నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం
- April 18, 2020
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోన్న కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. షూటింగ్లు లేక ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినందనీయమనీ, అందులో తనూ భాగం కావాలనే ఉద్దేశంతో తన వంతుగా ఈ విరాళం అందిస్తున్నాననీ ఆయన చెప్పారు. కరోనా ఉధృతిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయనీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా తమ విధులను అహర్నిశలూ నిర్వహిస్తున్నారనీ ఆయన కొనియాడారు. అలాగే ఈ విపత్కర పరిస్థితుల్లో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమించడం గొప్ప విషయమని మోహన్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి తగ్గట్లు పౌరులుగా మనందరం మన ఇళ్లల్లోనే క్షేమంగా ఉంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మన వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..