సీసీసీకి నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం
- April 18, 2020
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోన్న కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. షూటింగ్లు లేక ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినందనీయమనీ, అందులో తనూ భాగం కావాలనే ఉద్దేశంతో తన వంతుగా ఈ విరాళం అందిస్తున్నాననీ ఆయన చెప్పారు. కరోనా ఉధృతిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయనీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా తమ విధులను అహర్నిశలూ నిర్వహిస్తున్నారనీ ఆయన కొనియాడారు. అలాగే ఈ విపత్కర పరిస్థితుల్లో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమించడం గొప్ప విషయమని మోహన్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి తగ్గట్లు పౌరులుగా మనందరం మన ఇళ్లల్లోనే క్షేమంగా ఉంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మన వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







