క్వారంటైన్లో కేదారనాథ్ ఆలయ అర్చకులు..
- April 20, 2020
కరోనా కారణంగా లాకడౌన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో సహా ప్రార్థనా మందిరాలన్నీ మూసి వేశారు. అయితే హిందువుల పవిత్ర ఆలయాల్లో ఒకటైన కేదారనాథ్ ఆలయాన్ని వచ్చే నెలలో తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఆలయాన్ని తెరుస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆలయ అధికారిని క్వారంటైన్లో 14 రోజులు ఉంచుతామన్నారు. మహారాష్ట్ర నాందేడ్లో నివసిస్తున్న ప్రధాన అర్చకుడు భీం శకర్ ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ప్రభుత్వ నియమావళిని అనుసరించి ఆయన్ను క్వారంటైన్కి తరలించనున్నారు. ఆలయంలో పూజాదికాలు నిర్వహించే సమయంలో భక్తులతో భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని, వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటారని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ వివరించారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







