ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- April 21, 2020
అమెరికాలో కరోనావైరస్ విలయతాండం చేస్తున్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అక్కడి ఇప్పటికే 40 వేల మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ట్రంప్. "అదృశ్య శత్రువు నుండి దాడి, అలాగే మా గొప్ప అమెరికన్ పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున, యునైటెడ్ స్టేట్స్ లోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి నేను ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేస్తాను!" అంటూ ఆయన కాసేపటి క్రితమే చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, ఈ ఉత్తర్వుల వివరాలు ఇంకా స్పష్టంగా తెలియదు.. ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేస్తారో కూడా క్లారిటీ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







