దుబాయ్ :ఆదివారం నుంచి మెట్రో, బస్, ట్యాక్సీ సర్వీసులు మళ్లీ ప్రారంభం
- April 24, 2020
దుబాయ్:లాక్ డౌన్ తో దుబాయ్ లో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన ప్రజారవాణా మళ్లీ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం నుంచి దుబాయ్ మెట్రోతో పాటు బస్సులు కూడా తమ సాధారణ సర్వీసులను ప్రారంభించనుంది. అలాగే ట్యాక్సీ కార్లు కూడా రోడ్ల మీదకు రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దుబాయ్ సుప్రీం కమిటీ సూచనల మేరకు కొన్నాళ్లుగా ప్రజారవాణా సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..వైరస్ ప్రభావాన్ని సమీక్షించుకున్న తర్వాత వచ్చే ఆదివారం నుంచి ప్రజారావాణా సర్వీసులకు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దుబాయ్ రవాణా శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే మెట్రో, బస్సు సర్వీసుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని..ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండబోవని కూడా అధికారులు స్పష్టం చేశారు. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైల్ నడుస్తుంది. ఇక బస్సు సర్వీసులు 13 రూట్లలో నడుస్తాయని..సాధారణ టైం టేబుల్ (ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అయితే..కరోనా వైరస్ కట్టడికి అన్ని ముందు జాగ్రత్తలు పాటించి తీరాల్సిందేనని కూడా రవాణాశాఖ అధికారులు తెలిపారు. బస్సు, మెట్రో రైలులో సామాజిక దూరం పాటించటంతో పాటు..అందరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఇక ట్యాక్సీలో డ్రైవర్ తో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు