సౌదీ అరేబియా/కరోనా: 11 మంది భారతీయులు మృతి

- April 24, 2020 , by Maagulf
సౌదీ అరేబియా/కరోనా: 11 మంది భారతీయులు  మృతి

రియాద్: సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు కరోనా కోవిడ్‌-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం వద్ద ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్ తో మరణించారు.ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి.

మరణించిన వారి వివరాలు...

మదీనా--4
మక్కా--3
జెడ్డా--2
రియాద్‌--1
ధమ్మామ్--1

లాక్ డౌన్ కారణంగా భారత్ కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com