ఏపీలో విజృంభిస్తున్న కరోనా..

- April 27, 2020 , by Maagulf
ఏపీలో విజృంభిస్తున్న కరోనా..

ఏపీలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులలో కృష్ణా 33 , గుంటూరు లో 23 , కర్నూల్ 13 , నెల్లూరు 7 , పశ్చిమ గోదావరి ౩, శ్రీకాకుళంలో 1 కేసు నమోదైంది. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసులకు గాను 235 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 911గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com