యూఏఈ: కరోనా కష్టాల్లో తెలుగోడి సాయం..నిత్యావసర సరుకుల పంపిణీ
- April 27, 2020
యూఏఈ: అసలే దేశంగానీ దేశం. ఆపై కరోనా వైరస్ కష్టాలు. ఉపాధి కోసం ఎడారి దేశం వలస వచ్చిన తెలుగువారికి ప్రస్తుత సంక్షోభంలో బాసటగా నిలిచారు తిరుపతికి చెందిన ముక్కు తులసి కుమార్. యూఏఈలో ఇళ్లలో పని చేసే పలువురు తెలుగువారికి బియ్యం పంపిణి చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురు దాతలను సంప్రదించి దాదాపు నాలుగు టన్నుల బియ్యాన్ని సేకరించిన ముక్కు తులసి కుమార్..ఇప్పటికే 3 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరో వెయ్యి కిలోల బియ్యాన్ని రేపు పంచేందుకు ప్లాన్ చేసినట్లు ఆయన వివరించారు. అంతేకాదు..మరో 3 టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందించేందుకు మరో దాత సిద్ధంగా ఉన్నట్లు తులసి కుమార్ తెలిపారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో బియ్యాన్ని పంపిణి చేయడానికి సహకరించిన దాతలందరికి తులసి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాలవాళ్ళకే కాకుండా నేపాల్ , శ్రీలంకకు చెందిన పనిమనుషులకు కూడా బియ్యాన్ని పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు. తొలి రోజు పంపిణీలో ముక్కు తులసి కుమార్ తో పాటు విశ్వేశ్వరరావు, కట్టారు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







