యూఏఈ: కరోనా కష్టాల్లో తెలుగోడి సాయం..నిత్యావసర సరుకుల పంపిణీ
- April 27, 2020
యూఏఈ: అసలే దేశంగానీ దేశం. ఆపై కరోనా వైరస్ కష్టాలు. ఉపాధి కోసం ఎడారి దేశం వలస వచ్చిన తెలుగువారికి ప్రస్తుత సంక్షోభంలో బాసటగా నిలిచారు తిరుపతికి చెందిన ముక్కు తులసి కుమార్. యూఏఈలో ఇళ్లలో పని చేసే పలువురు తెలుగువారికి బియ్యం పంపిణి చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురు దాతలను సంప్రదించి దాదాపు నాలుగు టన్నుల బియ్యాన్ని సేకరించిన ముక్కు తులసి కుమార్..ఇప్పటికే 3 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరో వెయ్యి కిలోల బియ్యాన్ని రేపు పంచేందుకు ప్లాన్ చేసినట్లు ఆయన వివరించారు. అంతేకాదు..మరో 3 టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందించేందుకు మరో దాత సిద్ధంగా ఉన్నట్లు తులసి కుమార్ తెలిపారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో బియ్యాన్ని పంపిణి చేయడానికి సహకరించిన దాతలందరికి తులసి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాలవాళ్ళకే కాకుండా నేపాల్ , శ్రీలంకకు చెందిన పనిమనుషులకు కూడా బియ్యాన్ని పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు. తొలి రోజు పంపిణీలో ముక్కు తులసి కుమార్ తో పాటు విశ్వేశ్వరరావు, కట్టారు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







