భారత్, కువైట్ మధ్య విడదీయరాని సన్నిహిత సంబంధాలు: కువైట్ రాయబారి
- April 27, 2020
కువైట్:భారతదేశంలో కువైట్ రాయబారి జస్సెమ్ అల్ నజీమ్, భారత్ మరియు కువైట్ మధ్య సన్నిహిత సంబంధాలకు చారిత్రక నేపథ్యం వుందని అన్నారు. ఇరు దేశాలూ పలు అంశాలపై కలిసి ముందడుగు వేస్తున్నాయని చెప్పారు. పొలిటికల్, ఎకనమిక్ డొమైన్స్ విషయాల్లో భారత్ - కువైట్ ఎప్పుడూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇరు దేశాలూ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయనీ, పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. ఫారిన్ పాలసీస్ విషయంలో ఈ రెండు దేశాల వ్యవహార శౖలి దాదాపు ఒకేలా వుంటోందని చెప్పారు. ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన కీలక సమావేశం కరోనా వైరస్ కారణంగా రద్దయినట్లు చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







