బిచ్చగాళ్లకు దానాలు చేయొద్దు..దుబాయ్ పోలీసు హెచ్చరిక
- April 28, 2020
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో దానధర్మాలు నిర్వహించాలనుకునే వారి యూఏఈలోని అధికారిక సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాని ఎవరూ బిచ్చగాళ్లకు డబ్బులు దానం చేయొద్దని హెచ్చరించింది. పుణ్యం పేరుతో సులువుగా డబ్బు సంపాదించే యాచకులను ప్రొత్సహించకూడదని తెలిపింది. యూఏఈ చట్టాల ప్రకారం బిచ్చమెత్తుకోవటం నిషేధం. యాచించటం కూడా ఒక రకంగా దొంగతనం లాంటిదేనని పోలీసులు అభిప్రాయపడ్డారు. సులువుగా డబ్బు సంపాదనకు అనారోగంతో బాధపడుతున్న వారిని, చిన్నపిల్లల్ని ఓ అవకాశంగా వాడుకొని జాలి కలిగించేలా ప్రేరేపిస్తారని అధికారులు వివరించారు. అందుకే బిచ్చమెత్తుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించవద్దన్నారు. రమదాన్ మాసం..పైగా కరోనా సంక్షోభాన్ని సింపతిగా వాడుకొని ఎవరైనా యాచించిట్లు కనిపిస్తే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. బిచ్చగాళ్లను గుర్తించేందుకు ఇప్పటికే పలు చోట్ల పాట్రోలింగ్ పెంచామని, ఎవరైనా యాచించినట్లు కనిపిస్తే 901కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







