బిచ్చగాళ్లకు దానాలు చేయొద్దు..దుబాయ్ పోలీసు హెచ్చరిక
- April 28, 2020
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో దానధర్మాలు నిర్వహించాలనుకునే వారి యూఏఈలోని అధికారిక సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాని ఎవరూ బిచ్చగాళ్లకు డబ్బులు దానం చేయొద్దని హెచ్చరించింది. పుణ్యం పేరుతో సులువుగా డబ్బు సంపాదించే యాచకులను ప్రొత్సహించకూడదని తెలిపింది. యూఏఈ చట్టాల ప్రకారం బిచ్చమెత్తుకోవటం నిషేధం. యాచించటం కూడా ఒక రకంగా దొంగతనం లాంటిదేనని పోలీసులు అభిప్రాయపడ్డారు. సులువుగా డబ్బు సంపాదనకు అనారోగంతో బాధపడుతున్న వారిని, చిన్నపిల్లల్ని ఓ అవకాశంగా వాడుకొని జాలి కలిగించేలా ప్రేరేపిస్తారని అధికారులు వివరించారు. అందుకే బిచ్చమెత్తుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించవద్దన్నారు. రమదాన్ మాసం..పైగా కరోనా సంక్షోభాన్ని సింపతిగా వాడుకొని ఎవరైనా యాచించిట్లు కనిపిస్తే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. బిచ్చగాళ్లను గుర్తించేందుకు ఇప్పటికే పలు చోట్ల పాట్రోలింగ్ పెంచామని, ఎవరైనా యాచించినట్లు కనిపిస్తే 901కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







