మస్కట్:అనవసరమైన వీడియో కాల్స్ ను మానుకోండి..టీఆర్ఏ సూచన
- April 28, 2020
మస్కట్:ఇంటర్నెట్ ను వినోదం కోసం వినియోగించుకోవటాన్ని నియంత్రించుకోవాలని టెలికం రెగ్యూలేటరి అధారిటి వినియోగదారులను కోరింది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనవసరంగా ఇంటర్నెట్ వాడొద్దని సూచించింది. ఆ సమయంలో ఈ-లెర్నింగ్, హెల్త్ కేర్, వివిధ ఆఫీసులు తమ లక్ష్యాలను నేరవేర్చేందుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఏ కోరింది. ఆఫీస్ అవర్స్ లో ఇంటర్నెట్ ను వినోదాల కోసం వినియోగిస్తే నెట్ వర్క్ పై లోడ్ ఎక్కువై కీలకమైన సేవా రంగాలకు ఇంటర్నెట్ స్పీడు తగ్గే అవకాశాలు ఉంటాయని వివరించింది.
అంతేకాదు..వీలైనంత వరకు ప్రజలు వీడియో కాల్స్ నియంత్రించుకోవాలని, పీక్ అవర్స్ సమయంలోనే కాదు..సాధారణ సమయాల్లోనూ వీడియో కాల్స్ ను చేయకపోవటమే మంచిదని సూచించింది. నెట్ వర్క్ పై లోడ్ తగ్గించేందుకు వీడియో కాల్స్ కి బదులు ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసుకోవాలని టెలికం రెగ్యూలేటరి అధికారులు కోరారు. అలాగే పిల్లలను కూడా ఇంటర్నెట్ లో వీడియోలు చూడటాన్ని కూడా మాన్పించాలని..దానికి బదులు ఇతర కాలక్షేప మార్గాలను వారికి సూచించాలని తల్లిదండ్రులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం







