బహ్రెయిన్: అన్ని రకాల వీసా గడువును 3 నెలలపాటు పెంపు
- April 28, 2020
మనామా:కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలతో పాటు పలు వెసులుబాట్లు కలిపిస్తున్న బహ్రెయిన్ ప్రభుత్వం..వీసాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విజిట్ వీసా మీద దేశానికి వచ్చిన వలసదారులు, పర్యాటకుల వీసాతో పాటు అన్ని రకాల వీసాల గడువును 3 నెలల పాటు పొడిగించింది. జూలై 23తో వీసా గడువు ముగిసినా..ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని, అలాగే ఒక్క దినార్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే కరోనా విపత్తు నేపథ్యంలో ఇప్పటికే బహ్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు పలు చెల్లింపుల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరో మూడు నెలల పాటు కరెంటు బిల్లు, వాటర్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అలాగే క్రెడిట్ కార్డు ఈఎంఐలను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!







