గలేరియా అల్ మర్యాహ్ ఐలాండ్ షాపింగ్ మాల్ పునఃప్రారంభం
- May 02, 2020
అబుధాబి:మే 2 నుంచి గలేరియా అల్ మర్యాహ్ ఐలాండ్ సెంటర్ పునఃప్రారంభమయ్యింది. అబుధాబి గ్లోబల్ మార్కెట్ మరియు అబుధాబి ఎకనమిక్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ అనంతరం ఈ సెంటర్ ప్రారంభానికి అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం 30 శాతం మంది కస్టమర్ కెపాసిటీతో గలేరియా అందుబాటులోకి వచ్చింది. పార్కింగ్ స్పేస్ని తగ్గించడం, ఫుడ్ ఔట్లెట్స్ని రివైజ్ చేయడం వంటివి పూర్తి చేశాక అనుమతులు మంజూరు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎంప్లాయీస్ మరియు షాపర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకున్నారు. రమదాన్ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాల్ తెరిచి వుంటుంది. సూపర్ మార్కెట్స్ మరియు ఫార్మసీస్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి వుంటాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







