'మాట'
- May 22, 2015
రెండు అక్షరాల పదానికి ఎనలేని అర్ధం ఉంది. ఇది పూవుకన్నా మెత్తనైనది.వజ్రం కన్నా గట్టిది.తలచుకుంటే ప్రళయ వాతావరణాన్ని సృష్టించగలదు మరియు సామరస్య సంకేతాలనూ దీని ద్వారా పంపవచ్చు.భావ వ్యక్తీకరణకు పట్టుకొమ్మ అయిన మాట పైనే ప్రపంచమంతా ముందుకు సాగుతోంది.ఒక దేశాధ్యక్షుడు మితిమీరి మాటలు జారితే అది చివరకు పపంచ యుద్ధం దాకా దారితీయవచ్చు.మానవ సంబంధాలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా అత్యంత భూమిక నిర్వహిస్తుంది.కాబట్టి మాట్లాడే ముందు తగు జాగ్రత్త వహించడం చాలా అవసరం.ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆచీతూచీ వ్యవహరించాలి.మంచి మాటలనే విత్తనాలను వీరి మెదళ్ళలో నాటి, పోషించగలిగితే, వీరి భవిష్యత్తు వృజ్వలంగా మారి మహావృక్షమై పదిమందికీ ఫలాలను అందించ గలుగుతుంది. విషభీజాలను నాటితే తీవ్రవాదిగా తయారవుతారు.కనుక, మానవులకు మాత్రమే ఉన్న "విచక్షణా జ్ఞానాన్ని" వినియోగించి మాట్లాడాలి.మాట అద్దంలాంటిది.అది పగిలితే అతుక్కోవడం అంత సులభంగాదు.
మాట ద్వారానే వ్యక్తిత్వ వికాసం తెలుసుకోగలుగుతాం.వ్యక్తిత్వ వికాసానికి తనచుట్టూ ఉండే పరిసరాలు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థయే పునాది.ఈ కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది, వ్యవహారశైలి.ఈ వ్యవహారశైలిక మాధ్యమమే "మాట".పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపే మన పెద్దల వ్యవహారశైలి అనే వృక్షానికి మంచిమాటలనే నీళ్ళుపోసి, పెంచి, పోషించి, ఆ నీడలో మన పిల్లలు పెరగాలని మరియు వారి మనుగడకు మనం మార్గదర్శకంగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
--- యస్.పి. సోమ సుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







