దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- May 07, 2020
దుబాయ్:తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ మరియు ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రా మే 6న జరిగింది. ఈ డ్రాలో ముగ్గురు భారతీయ వలసదారులు విజేతలుగా నిలిచారు. 47 ఏళ్ళ అజిత్ నరేంద్రన్, 1 మిలియన్ డాలర్స్ విజేతగా నిలిచారు. అబుదాబీలో ప్రస్తుతం నివాసముంటున్నారు అజిత్ నరేంద్రన్. అబుదాబీలోని మారియట్ హోటల్లో పర్చేజింగ్ మేనేజర్గా నరేంద్రన్ పనిచేస్తున్నారు. కేరళకు చెందిన నరేంద్రన్, 3 ఏళ్ళుగా అబుదాబీలో నివసిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతం చాలా ప్రత్యేకంగా వుందనీ, ఈ గెలుపుని తాను నమ్మలేకపోతున్నానని అన్నారాయన. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ మోటర్ బైక్లు బహుమతిగా వరించాయి. ఓ వీజేత అబ్దుల్ జలీల్, స్వదేశానికి వెళ్ళారు. ఆయన కేరళకు చెందినవారు. రాజేష్ బాలన్ అనే మరో భారతీయుడు మోటో గుజ్జి ఆడాస్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో లాజిస్టిక్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







