బాంబు పేలుడు-ఇద్దరు పోలీసుల మృతి :ఈజిప్టు
- January 28, 2016ఈజిప్టు ఉత్తర ప్రాంతంలోని సినాయ్ ప్రావిన్స్లో పోలీసు వాహనంలో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. అల్-అరిష్ నగరంలో పోలీసులు తమ వాహనంలో వెళ్తుండగా పేలుడు సంభవించిందని, ఇద్దరు పోలీసులు మృతిచెందారని దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతా దళాలు ఘటనపై విచారణ చేపట్టాయి. రెండు రోజుల క్రితం ఇదే నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో అయిదుగురు పోలీసులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో గత కొంత కాలంగా మిలిటెంట్ల దాడులతో విరుచుకుపడుతున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్