బాంబు పేలుడు-ఇద్దరు పోలీసుల మృతి :ఈజిప్టు

- January 28, 2016 , by Maagulf
బాంబు పేలుడు-ఇద్దరు పోలీసుల మృతి :ఈజిప్టు

ఈజిప్టు ఉత్తర ప్రాంతంలోని సినాయ్‌ ప్రావిన్స్‌లో పోలీసు వాహనంలో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. అల్‌-అరిష్‌ నగరంలో పోలీసులు తమ వాహనంలో వెళ్తుండగా పేలుడు సంభవించిందని, ఇద్దరు పోలీసులు మృతిచెందారని దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతా దళాలు ఘటనపై విచారణ చేపట్టాయి. రెండు రోజుల క్రితం ఇదే నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో అయిదుగురు పోలీసులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో గత కొంత కాలంగా మిలిటెంట్ల దాడులతో విరుచుకుపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com