బాంబు పేలుడు-ఇద్దరు పోలీసుల మృతి :ఈజిప్టు
- January 28, 2016ఈజిప్టు ఉత్తర ప్రాంతంలోని సినాయ్ ప్రావిన్స్లో పోలీసు వాహనంలో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. అల్-అరిష్ నగరంలో పోలీసులు తమ వాహనంలో వెళ్తుండగా పేలుడు సంభవించిందని, ఇద్దరు పోలీసులు మృతిచెందారని దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతా దళాలు ఘటనపై విచారణ చేపట్టాయి. రెండు రోజుల క్రితం ఇదే నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో అయిదుగురు పోలీసులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో గత కొంత కాలంగా మిలిటెంట్ల దాడులతో విరుచుకుపడుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక