రీపాట్రియేట్స్‌ని టార్గెట్‌ చేసిన స్పామర్స్‌

- May 07, 2020 , by Maagulf
రీపాట్రియేట్స్‌ని టార్గెట్‌ చేసిన స్పామర్స్‌

మస్కట్‌: తమ పౌరుల్ని స్వదేశాలకు తరలించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్న వేళ, స్పామర్స్‌ పంజా విదిలిస్తున్నారు.. స్పామర్స్‌ ధాటికి రిపాట్రియేట్స్‌ దారుణంగా నష్టపోయే అవకాశం వుంది. ఎంబసీ అధికారులమని చెప్పి కొందరు స్పామర్స్‌, అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని బ్యాంక్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌, ఓటీపీలను సేకరించి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపత్యంలో ఆయా దేశాలకు చెందిన ఎంబసీలు, తమ పౌరులకు పలు సూచనలతో కూడిన హెచ్చరికలు చేస్తున్నాయి. ఓటీపీలు ఎవరికీ ఇవ్వరాదనీ, బ్యాంక్‌ డిటెయిల్స్‌ విషయంలో జాగ్రత్తగా వుండాలనీ, స్పామర్స్‌ సందేశాలను చూసి మోసపోకుండా ఎంబసీల అధికారిక వెబ్‌సైట్లలో సమాచారాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా ఎయిర్‌లైన్‌ సంస్థలు కూడా ఈ విషయమై ప్రయాణీకుల్ని అప్రమత్తం చేస్తున్నాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com