షార్జా అగ్నిప్రమాదం రిపోర్ట్:నిషేధిత అల్యూమినియం పూత కారణం
- May 07, 2020
షార్జా:షార్జాలో 49 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాద తీవ్రత పెరగటానికి నిషేధిత అల్యూమినియం పూత కారణమని అధికారులు నిర్ధారించారు. బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగానే క్షణాల్లో మంటలు విస్తరించాయని...భవనం ముందు భాగంగాలో అల్యూమినియం పూత ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని వివరించారు. ఈ మేరకు ఫోరెన్సిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ సర్కల్ తన ప్రాధామిక విచారణ వివరాలను వెల్లడించారు. అయితే..అగ్నిప్రమాద ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందని అన్నారాయన. గతంలో కూడా అల్యూమినియం పూత కారణంగా చాలా భవనాలు అగ్నిప్రమాదాల బారిన పడ్డాయని, 2015, 2016, 2017 లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని బ్రిగేడియర్ అహ్మద్ వివరించారు. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో 2017లోనే భవనం ముఖభాగంలో అల్యూమినియం తాపడం వాడటాన్ని షార్జా మున్సిపాలిటి నిషేధించిందన్నారు. అయితే..ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గురైన అబ్కొ టవర్ నిషేధం అమలులోకి రాక ముందు నిర్మించారని, అయినా..అల్యూమినయం తాపడటాన్ని తొలగించాల్సిందిగా ఇది వరకు భవన యజమానికి ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే..తాజా ఘటనతో షార్జా మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాత భవనాలకు కూడా అల్యూమినియం పూతను తొలగించాలని ఆయా భవనాల యాజమాన్యాలకు సూచించాయి. షార్జాలో అల్యూమినియం పూత ఉన్న భవనాల వివరాలను సేకరించేందుకు సమగ్ర సర్వే నిర్వహిస్తామని షార్జా మున్సిపాలిటి ప్రకటించింది. అగ్నిప్రమాదాలకు దోహదం చేసే అల్యూమినియం పూతను తొలగించేందుకు నిర్ణీత గడువు ఇస్తామరి, ఆలోగా తాపడాన్ని మార్చాల్సిందేనని అధికారులు హెచ్చరించారు.


తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







