ఘోర రైలు ప్రమాదం..15మంది వలస కూలీలు మృతి
- May 08, 2020
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. మరణించిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్పై వలస కూలీలు నిద్రస్తుండగా, వారిపై నుంచి గూడ్స్ రైలు వెళ్ళినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలు కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ట్రాక్పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్ మధ్య నడిచే గూడ్స్ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు