షార్జా:అబ్కో టవర్ బాధితులకు నివాసం కల్పించాలన్న రూలర్
- May 09, 2020
షార్జా:షార్జాలో అగ్నిప్రమాదానికి గురైన అబ్కో టవర్ బాధితులకు తగిన సాయం చేయాలని షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి అన్నారు. టవర్ లో ఉండే వాళ్లందరికీ తగిన నివాస సౌకర్యం కల్పించాలని షార్జా చారిటీ అసోసియేషన్ ను ఆయన ఆదేశించారు. టవర్ లో మరమ్మత్తులు పూర్తై మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఖచ్చితంగా ఆవాసం కల్పించాల్సిందేనని అన్నారు. ఇదిలాఉంటే..షార్జా అగ్నిప్రమాద ఘటనను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు వాడుకునే కుట్రలు చేస్తున్నట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. బాధితులకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని హెచ్చరించారు. అగ్నిప్రమాదం బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సాయం అందుతోందని, వారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకొని సాయం చేసేందుకు అధికారిక కమిటి కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. ఒకవేళ ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే షార్జా చారిటీ అసోసియేషన్ ద్వారాగానీ, ఎమిరాతి రెడ్ క్రిసెంట్ ద్వారా సాయం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







