వందే భారత్ మిషన్..ఇండియా వెళ్లిన ఇద్దరికి కరోనా పాజిటివ్!!

- May 09, 2020 , by Maagulf
వందే భారత్ మిషన్..ఇండియా వెళ్లిన ఇద్దరికి కరోనా పాజిటివ్!!

దుబాయ్: వందే భారత్ మిషన్ తొలి అడుగులోనే ప్రమాదం. అదేంటి అనుకుంటున్నారా? యూఏఈ నుండి కేరళకు తిరిగి వెళ్లిన 363 మందిలో ఇద్దరు భారతీయులకు 
కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేరళ సిఎం పినరయి విజయన్ శనివారం తెలిపారు.

రోగులను కోజికోడ్, కొచ్చిలోని ఆసుపత్రులలో చేర్చారు. దీంతో మిగితా ప్రయాణీకులను తప్పనిసరి నిర్బంధానికి ఆదేశించారు అధికారులు. కరోనావైరస్ ప్రేరేపిత ప్రయాణ ఆంక్షల మధ్య విదేశాలలో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి భారత్ తన అతిపెద్ద ఆపేరేషన్ ను ప్రారంభించినందున యూఏఈ నుండి రెండు ప్రత్యేక విమానాలు 363 మంది భారతీయులను తిరిగి కేరళకు పంపించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com