మహారాష్ట్రలో కరోనా మారణహోమం..
- May 09, 2020
ముంబై:భారత దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా మారణహోమం సృష్టిస్తోంది.దీనికి తోడు 11వందలకు పైగా కొత్త కేసులు ఈ రోజు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం, గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యప్తంగా 1,165 కేసులు నమోదయ్యాయి. 48 మంది మృత్యువాత పడ్డారు. 330 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకొని మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,228కి చేరింది. 779 మంది మరణించారు. మొత్తం 3,800 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇంకా 16,428 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే మొత్తం 20,228 కేసుల్లో రాజధాని ముంబైలోనే 12,864 కేసులు రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే మొత్తం 779 మరణాల్లో 489 మరణాలు కూడా ముంబై పరిధిలోనే సంభవించాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!