కోవిడ్ 19:కరోనాతో కువైట్ లో ఇండియన్ డాక్టర్ మృతి

- May 10, 2020 , by Maagulf
కోవిడ్ 19:కరోనాతో కువైట్ లో ఇండియన్ డాక్టర్ మృతి

కువైట్ సిటీ:కరోనా వైరస్ తో కువైట్ లో మరో వైద్యుడు మృతి చెందాడు. భారత్ కు చెందిన ఎండోడాంటిస్ట్ డాక్టర్ వాసుదేవరావు కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా కువైట్ లో మృతి చెందిన తొలి భారతీయ వైద్యుడితనే. భారత దంతవైద్యుల అలయెన్స్ లో సభ్యుడైన డాక్టర్ వాసుదేవరావు..కువైట్ ఆయిల్ కంపెనీలో పనిచేసేవారు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ లక్షణాలతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించి నిన్న ఆయన మృతి చెందారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com