కువైట్:ఎయిర్ పోర్టు వెళ్లే వారికి కర్ఫ్యూ సమయంలోనూ అనుమతి
- May 10, 2020
కువైట్:కర్ఫ్యూ సమయంలోనూ ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు అనుమతి ఇచ్చేలా అంతర్గత మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. దీంతో పూర్తి స్థాయి కర్ఫ్యూ సమయంలోనూ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి వచ్చి పోయే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే..ప్రయాణికులు ఖచ్చితంగా విమాన టికెట్లను భద్రతా సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు...విమానాశ్రాయానికి వచ్చే ళ్లైనా...విమానాశ్రయం నుంచి వెళ్లే వాళ్లైనా క్యాబ్ లో డ్రైవర్ తో పాటు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడి తాలుకు విమాన ప్రయాణానికి సంబంధించి టికెట్ కాపీని తప్పని సరిగా చూపించాల్సి ఉంటుంది. భారత్ తో పాటు పలు దేశాలు కువైట్ లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను స్వదేశాలకు తీసుకువెళ్తున్న విషయం తెలిసిందే. అయితే..పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో స్వదేశాలకు వేళ్లే ప్రయాణికులకు ఈ మేరకు కువైట్ ప్రభుత్వం సూచనలు చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు