ఆర్థిక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
- May 13, 2020
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. లాక్ డౌన్ తో ఆదాయం పడిపోయింది. సామాన్యులు ఇంకా పేదవారిగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కుప్పకూలుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదే ప్రయత్నాల్లో భాగంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు.ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయబోతున్నారని ఊహాగానాలు భారీగా నెలకొన్నాయి. రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయించేదీ వివరించనున్నారనే అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరనుందన్న విషయాలపై ప్రకటన చేశారు. జపాన్ తమ జీడీపీలో 21 శాతం, అమెరికా 13 శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ తర్వాత అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించిన దేశంగా భారత్ నిలిచింది. వివిధ వర్గాలతో, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపాక ఈ ప్యాకేజ్ ప్రకటించాం. వివిధ పారిశ్రామిక వర్గాలతో మాట్లాడాం. లోకల్ బ్రాండ్ కు ప్రాధాన్యత. స్వయం సమృద్ధికి మోడీ పెద్ద పీట వేశారు. ఎకానమీ, మౌలిక రంగం, టెక్నాలజీ, వనరులపై ఫోకస్.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







