రోడ్డు ప్రమాదంలో 14 మంది వలస కార్మికులు దుర్మరణం
- May 14, 2020
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి సొంతూరికి ప్రయాణమైన వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు ప్రాణాలు కొల్పోయారు. మధ్యప్రదేశ్ లో వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీని ఓ బస్సు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. యూపీకి చెందిన వలస కూలీలు మహారాష్ట్ర నుంచి ఓ లారీలో బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదంలో బీహార్ కు చెందిన ఆరు వలస కూలీలు మృతి చెందారు. వీళ్లంతా పంజాబ్ నుంచి తమ స్వస్థలాలకు బయల్దేరారు. అయితే.. యూపీకి చెందిన ఆర్టీసీ బస్సు వలస కూలీలపై దుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







