కరోనా వైరస్‌: కువైట్‌లో భారత నర్స్‌ మృతి

- May 14, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: కువైట్‌లో భారత నర్స్‌ మృతి

కువైట్‌:భారత నర్స్‌ ఒకరు కువైట్‌లో కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతురాల్ని అన్నీ మాథ్యూ (54)గా గుర్తించారు. కేరళకు చెందిన అన్నీ మాథ్యూ, కువైట్‌ సెంట్రల్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో నర్స్‌గా సేవలందిస్తున్నారు. జబ్రియా ప్రాంతంలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. చివరిసారిగా ఆమె ఫిబ్రవరి 28న కేరళలోని తన స్వస్థలం తిరువల్లకు వెళ్ళారు. జబెర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించారని అధికారులు వెల్లడించారు. కువైట్‌లో కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ ప్రకారం అన్నీ మాథ్యూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com