తెలంగాణ:మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- May 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,414 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 428 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు అధికారులు.. ఇక, ఇవాళ 13 మందిని డిశ్చార్జ్ చేయగా.. డిశ్చార్జి అయినవారి సంఖ్య 952కి చేరింది.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది.. ఇవాళ ఒకే రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 40 కొత్త కేసులు వెలుగు చూడగా.. రంగారెడ్డి జిల్లాలో ఐదు కేసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇద్దరికి.. మొత్తంగా 47 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు