భారతీయుల రీపాట్రియేషన్: కేంద్రాన్ని ఆశ్రయించాలన్న సుప్రీంకోర్టు
- May 16, 2020
కువైట్లో రెసిడెన్సీ ఉల్లంఘనలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను వినియోగించుకోగలుగుతున్నా, స్వదేశానికి చేరలేక ఇబ్బందులు పడుతున్నారు కొందరు భారత వలసదారులు. వారిని స్వదేశానికి రప్పించాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలయ్యింది. పూర్తి వివరాలతో పిటిషనర్, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ దారుడికి సూచించింది. కువైట్లో ఆమ్నెస్టీ పొందిన నలుగురు భారత పౌరుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషన్ దారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సమస్యలేర్పడ్డాయి. మరోపక్క, వివిధ దేశాల్లో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి రప్పించేందుకు దశలవారీ కార్యక్రమాలు చేపడుతోంది భారత ప్రభుత్వం. మే 6 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







