ఈపీ మున్సిపాలిటీలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలు ప్రారంభం

- May 16, 2020 , by Maagulf
ఈపీ మున్సిపాలిటీలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలు ప్రారంభం

దమ్మమ్:కరోనా కట్టడికి సౌదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా తూర్పు ప్రావిన్స్ మున్సిపాలిటీ క్రిమిసంహారక చర్య(శానిటైజేషన్) ను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలను ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ఈ సెల్ఫ్ శానిటైజేషన్ మిషన్ తో సెకండ్ కు 2 లీటర్ల రసాయానాలను స్ప్రే చేయవచ్చు. ఒక్కో వాహనం 5 మీటర్ల ఎత్తు, 7 మీటర్ల వెడల్పు ఉంటుంది. వాహనానికి 16 చదరపు మీటర్ల ట్యాంక్ బిగించి ఉంటుంది. వాహనంలోని అత్యాధునిక సాంకేతికతో దానంతంట అదే వీధులను శానిటైజ్ చేస్తూ వెళ్తుంది. తొలిగా దీన్ని దమ్మమ్ స్ట్రీట్ లో ప్రారంభించారు. త్వరలోనే ఇలాంటి వాహనాలను మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com