దుబాయ్:1990-2020 మధ్య పని చేసిన వారికి Dh4,000 వస్తాయంటూ అసత్య ప్రచారం
- May 16, 2020
దుబాయ్:మీరు 1990-2020 మధ్య పని చేశారా? అయితే..మీకు కార్మిక శాఖ ఖాతాలో నుంచి Dh4,000 విత్ డ్రా చేసుకునేందుకు అర్హులు. మీరు కేవలం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబితే చాలు ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. వాట్సాప్ లో ఈ తరహా ప్రచారం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే..ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కార్మిక శాఖ స్పష్టం చేసింది. కార్మిక శాఖ అలాంటి సందేశాలను పంపించటం లేదని..అది శుద్ధ అసత్య ప్రచారమని తేల్చి చెప్పింది. వాట్సాప్ కు ఓ యూఆర్ఎల్ అడ్రస్ లింక్ పంపించి దానిని క్లిక్ చేయటం ద్వారా వారి పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా సూచిస్తుంది. labour.rebajaslive.com ద్వారా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతుంది. ఆ తర్వాత మీరు కార్మిక శాఖ నుంచి Dh4,000 విత్ డ్రా చేసుకునేందుకు పూర్తిగా అర్హులుగా నిర్ధారిస్తుంది. అయితే..అందుకు కొన్ని షరతులను కూడా నిర్దేశిస్తూ...వాట్సాప్ లో 20 మందికి లింక్ ను షేర్ చేయాలంటూ కండీషన్ పెడుతుంది. తీరా వాళ్లు పంపించిన లింకులను క్లిక్ చేసినా ఏమి ప్రయోజనం ఉండదు. పైగా మాల్ వేర్ ఎటాక్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రచారం యూఏఈలోనే కాదు..ఇండియాలోనూ జోరుగా జరుగుతోంది. కార్మిక శాఖ నుంచి Rs120,000 విత్ డ్రా చేసుకోవచ్చనే హామీతో వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారు. అయితే..భారత ప్రభుత్వం ఈ ప్రచారంలో పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







