తెలంగాణ:మరో 55 కరోనా పాజిటివ్‌ కేసులు

- May 16, 2020 , by Maagulf
తెలంగాణ:మరో 55 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మరో 8 కేసులు వలసదారులకు సంబంధించినవని కాగా.. సంగారెడ్డిలో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒక్క కేసు నమోదైనట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై శనివారం బులెటిన్‌ విడుదల చేశారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,509కు చేరుకుందని పేర్కొన్నారు. శనివారం 12 మంది కోలుకున్నారు. ఈ 12 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 971 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com