తెలంగాణ:మరో 55 కరోనా పాజిటివ్ కేసులు
- May 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 44 నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మరో 8 కేసులు వలసదారులకు సంబంధించినవని కాగా.. సంగారెడ్డిలో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒక్క కేసు నమోదైనట్లు ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై శనివారం బులెటిన్ విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,509కు చేరుకుందని పేర్కొన్నారు. శనివారం 12 మంది కోలుకున్నారు. ఈ 12 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 971 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







