భారత్ లో 90,000 దాటిన కరోనా కేసులు
- May 17, 2020
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే వుంది. ఇప్పటికే కేసుల్లో చైనా ను దాటిన భారత్...తాజా కేసులతో 90 వేలు క్రాస్ చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 4,987 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 124 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటి వరకు భారత్లో మొత్తం 90,927 కేసులు నమోదు కాగా, 2,872 కరోనా మరణాలు సంభవించాయి. ఇక 53,946 యాక్టివ్ కేసులు ఉండగా, 34,108 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేటితో లాక్ డౌన్ 3 ముగుస్తున్న వేళ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ ను సడలిస్తే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు వాతావరణం కూడా చల్లబడింది. దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







