ఇంటి నుండే కరోనా పరీక్ష చేయించుకోవచ్చు

- May 17, 2020 , by Maagulf
ఇంటి నుండే కరోనా పరీక్ష చేయించుకోవచ్చు

దుబాయ్: ఇప్పుడు మీరు కరోనా పరీక్షలు ఇంటి నుండే చేయించుకోవచ్చు. 'అవివో హెల్త్ గ్రూప్' ప్రారంభించిన ఈ సౌకర్యంతో దుబాయ్ మరియు షార్జా వాసులు ఇంటిలోనే శ్వాబ్ టెస్ట్ లు చేయించుకోవచ్చు.

గ్రూప్ సిఇఓ డాక్టర్ అతుల్ ఆందేకర్ మాట్లాడుతూ “మేము ఇంట్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమ్రేస్ చైన్ రియాక్షన్ (ఆర్టిపిసిఆర్) పరీక్షను అందిస్తున్నాము. ఈ పరీక్ష COVID-19 కొరకు ప్రామాణికం గా పరిగణించబడుతోంది. ఫలితాలు 24 గంటల్లో తిరిగి వస్తాయి. ఈ టెస్టులు చేసేందుకు అన్ని విధాలా మా గ్రూప్ కి లైసెన్స్ ఉంది. చాలా మంది ప్రజలు బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు, పరీక్షా కేంద్రానికి వెళ్లడం మరింత భయాన్ని కలిగిస్తోంది అందుచేతనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము".

"పరీక్ష ఫలితం పాజిటివ్ అని తెలిస్తే, రెండు రకాల చర్యలు అవసరం" అని డాక్టర్ అతుల్ ఆందేకర్ అన్నారు. “వ్యక్తి లక్షణరహితంగా ఉంటే, మార్గదర్శకాల ప్రకారం, వారిని ఇంట్లో నిర్బంధించవచ్చు. స్థలం లేకపోవడం లేదా షేరింగ్ వసతి లో నివసించటం వంటి కొన్ని కారణాల వల్ల, అతను/ఆమె ఇంటి నిర్బంధాన్ని చేయలేకపోతే, అప్పుడు వ్యక్తిని అనేక ఆసుపత్రులు నడుపుతున్న ఏ హోటళ్లలోనైనా ఒక ఐసోలేషన్ సెంటర్‌కు మార్చవచ్చు. తేలికపాటి రోగలక్షణ కేసులను కూడా అలాంటి ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలి. ఆరోగ్య అధికారులు జారీ చేసిన ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం మితమైన, తీవ్రమైన లేదా క్లిష్టమైన లక్షణాలు ఉన్న ఎవరైనా ఆసుపత్రికి తరలించబడతారు.” అని అతుల్ అన్నారు.

ఛార్జీలు ప్రతి వ్యక్తికి 400 దిర్హాములు. కార్మికుల వసతి లేదా కార్యాలయాలకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

గృహ పరీక్షా సదుపాయానికి ప్రజల నుండి చాలా మంచి స్పందన లభించింది. గత వారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికే 300 కి పైగా టెస్ట్ బుకింగ్‌లు జరిగాయని డాక్టర్ అతుల్ తెలిపారు.

టెస్ట్ కై బుకింగ్ ల కొరకు 050-291-9005 లేదా 055-548-8911 నంబర్లకు కాల్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com