మే 31 వరకు లాక్‌డౌన్:కేసీఆర్

- May 18, 2020 , by Maagulf
మే 31 వరకు లాక్‌డౌన్:కేసీఆర్

హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు అని తెలిపారు. హైదరాబాద్‌లో GHMC కమిషనర్‌ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.1,452 కుటుంబాలకు కట్టడి ప్రాంతాల్లో ఉన్నాయని, కట్టడి ప్రాంతాల్లోని ప్రజలంతా సహకరించాలని కేసీఆర్‌ కోరారు. కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని  కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com