తెలంగాణ: కొత్తగా 41 పాజిటివ్‌ కేసులు

- May 18, 2020 , by Maagulf
తెలంగాణ: కొత్తగా  41 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సోమవారం మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 26 కేసులు నమోదయ్యాయి. మరో 12 కేసులు వలసదారులకు సంబంధించినవి. కాగా.. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,593కు చేరింది. అందులో 69 మంది వలసదారులే ఉన్నారు. సోమవారం 10 మంది కోలుకోగా, వారితో కలిపి 1002 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 34 మంది చనిపోగా, ప్రస్తుతం 556 మంది చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com