బహ్రెయిన్:క్షమాభిక్ష పొందిన 127 మంది భారతీయులను..స్వదేశానికి తరలింపు
- May 19, 2020
బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన వారిలో 127 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక విమానంలో వారిని కొచ్చికి చేరుకున్నారు. ఇందులో 56 మంది కేరళవాసులు కూడా ఉన్నారు. రెండు దేశాల పరస్పర సహకారంతో పాటు కరోనా నేపథ్యంలో 901 మంది భారతీయులకు బహ్రెయిన్ ప్రభుత్వం గత మార్చిలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. మరోవైపు కొచ్చి చేరుకున్న వారి ఇండియన్లను అక్కడి అధికారులు స్థానిక నావల్ ఎయిర్మెన్ స్కూల్ లో నిర్బంధంలో ఉంచారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి పంపించనున్నారు. జరిమానాలు కూడా చెల్లించలేక జైలులో మగ్గుతున్న ఇండియన్లకు క్షమాభిక్ష ప్రసాదించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి..భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్ లో పర్యటించిన తర్వాత ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడిందని...పరస్పర సహకారం మరింత
మెరుగ్గా ఉందని బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







