బహ్రెయిన్:క్షమాభిక్ష పొందిన 127 మంది భారతీయులను..స్వదేశానికి తరలింపు
- May 19, 2020
బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన వారిలో 127 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక విమానంలో వారిని కొచ్చికి చేరుకున్నారు. ఇందులో 56 మంది కేరళవాసులు కూడా ఉన్నారు. రెండు దేశాల పరస్పర సహకారంతో పాటు కరోనా నేపథ్యంలో 901 మంది భారతీయులకు బహ్రెయిన్ ప్రభుత్వం గత మార్చిలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. మరోవైపు కొచ్చి చేరుకున్న వారి ఇండియన్లను అక్కడి అధికారులు స్థానిక నావల్ ఎయిర్మెన్ స్కూల్ లో నిర్బంధంలో ఉంచారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి పంపించనున్నారు. జరిమానాలు కూడా చెల్లించలేక జైలులో మగ్గుతున్న ఇండియన్లకు క్షమాభిక్ష ప్రసాదించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి..భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్ లో పర్యటించిన తర్వాత ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడిందని...పరస్పర సహకారం మరింత
మెరుగ్గా ఉందని బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







