ఇండియా: మే 25 నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు షురూ

- May 20, 2020 , by Maagulf
ఇండియా: మే 25 నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు షురూ

ఢిల్లీ: కరోనావైరస్‌ను నియంత్రించటానికి తొలుత మార్చి 25న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు.

మే 18వ తేదీ నుంచి నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ విమాన సర్వీసులు మొదలు కాలేదు. ఈ సర్వీసులను మే 25వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి బుధవారం ట్విటర్‌లో తెలిపారు.

సర్వీసులను పున:ప్రారంభించటానికి సంసిద్ధం కావాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమనయాన సంస్థలకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రయాణికుల కదలికలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణా పద్ధతులు (ఎస్ఓపీల) వేరుగా జారీ చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com