తెలంగాణలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు
- May 21, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1699కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఐదుగురు వైరస్ కారణంగా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 45కి చేరింది. కొత్తగా నమోదైన వాటిల్లో జీహెచ్ఎంసీలో 26, రంగారెడ్డిలో 2 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,036 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్బులిటెన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!