అబుధాబి:'ఉచిత టిక్కెట్ల' వార్త పై స్పందించిన ISC సెక్రటరీ
- May 22, 2020
మిత్రులారా ఈ రోజు ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫార్వర్డ్ చేసిన వాయిస్ రికార్డ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా వినడం జరిగింది. అందులో నా పేరు ను ఉచ్చరిస్తూ నేను ISC మరియు Indian Embassy సహకారం తో ఇక్కడి నుండి వెళ్ళే కార్మికులకు ఉచిత టిక్కెట్లు ఇప్పిస్తున్నానని తప్పుడు ప్రచారం చేసారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు మరియు వారి ప్రకటన ఆంతర్యం తో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇండియా సోషల్ సెంటర్ లో ఒక బాధ్యాతయుతమైన స్థానము లో ఉన్నాను. ఇండియా సోషల్ సెంటర్ ని కానీ, నన్ను కానీ అభాసు పాలు చెయ్యడం ఎంత మాత్రం సబబు కాదని ఆ వాయిస్ రికార్డ్ ఫార్వర్డ్ చేస్తున్న వారికి చెప్పగలరు. ఏ మెసేజ్ నయినా ఫార్వర్డ్ చేసేముందు దాని నిజ నిర్ధారణ చేసుకోవాల్సింది గా మరొక్క సారి అందరికి విన్నపం. నాకు గాని అందులో పేర్కొన్న సంస్థల కు గాని ఆ వాయిస్ రికార్డ్ కు ఎటువంటి సంబంధం లేదని మరొక్కసారి ఘంటాపథంగా చెవుతున్నాను.
--ఇట్లు మీ రాజా శ్రీనివాస రావు ఐత(ISC సెక్రటరీ)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







