గల్ఫ్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు 97 ఫ్లైట్స్ నడపనున్న ఇండిగో
- May 22, 2020
లాక్ డౌన్ తో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే వందే భారత్ మిషన్ లో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా భాగస్వామ్యం అవుతోంది. గల్ఫ్ దేశాల్లోని నాలుగు దేశాల నుంచి ఇండియాకు మొత్తం 97 విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ఇందులో 23 సర్వీసులను కువైట్ నుంచి కేరళకు నడపనుంది. అలాగే దోహా నుంచి 28, మస్కట్ నుంచి 10, సౌదీ నుంచి 36 విమాన సర్వీసులను కేరళకు నడపనుంది. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణను అన్ని జాగ్రత్తలు పాటిస్తామని ఇండిగో వెల్లడించింది. ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే విమాన సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై భారత విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ..వందే భారత్ మిషన్ లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు త్వరలోనే ఆయా విమానయాన సంస్థలకు కూడా అనుమతి ఇస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







