గల్ఫ్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు 97 ఫ్లైట్స్ నడపనున్న ఇండిగో
- May 22, 2020
లాక్ డౌన్ తో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే వందే భారత్ మిషన్ లో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా భాగస్వామ్యం అవుతోంది. గల్ఫ్ దేశాల్లోని నాలుగు దేశాల నుంచి ఇండియాకు మొత్తం 97 విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ఇందులో 23 సర్వీసులను కువైట్ నుంచి కేరళకు నడపనుంది. అలాగే దోహా నుంచి 28, మస్కట్ నుంచి 10, సౌదీ నుంచి 36 విమాన సర్వీసులను కేరళకు నడపనుంది. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణను అన్ని జాగ్రత్తలు పాటిస్తామని ఇండిగో వెల్లడించింది. ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే విమాన సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై భారత విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ..వందే భారత్ మిషన్ లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు త్వరలోనే ఆయా విమానయాన సంస్థలకు కూడా అనుమతి ఇస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







