రమదాన్ సందర్భంగా ప్రవాస కార్మికులకు 4 లక్షల ఆహార పొట్లాల పంపిణీ
- May 22, 2020
మనామా:బహ్రెయిన్ రాజధాని మనామాలో ప్రవాస కార్మికులకు ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా చేపట్టిన ఫీనా ఖైర్ లో భాగంగా దాదాపు 4 లక్షల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనామా గవర్నర్ షేక్ హిషమ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో భాగంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తము ప్రవాస కార్మికులకు ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశం మానవతా దృక్పధం చాటుతోందన్నారు. బహ్రెయిన్ సమాజంలో భాగమైన విలువలకు ఫీనా ఖైర్ ఓ సంకేతమన్నారు. కష్టాల్లో ఉన్నవారికి తాము సంఘీభావంగా నిలబడతామన్నారు. మరోవైపు కష్టాల్లో ఉన్న వారి ఆకలి బాధ తీర్చేందుకు ఫీనా ఖైర్ చేపట్టాలని ఆదేశించిన జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫాపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజధాని ప్రాంతంలో ప్రతి రోజు ఆహార పొట్లాలను అందించేలా స్వసంచ సంస్థలు, వాలంటీర్లు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







