రమదాన్ సందర్భంగా ప్రవాస కార్మికులకు 4 లక్షల ఆహార పొట్లాల పంపిణీ
- May 22, 2020
మనామా:బహ్రెయిన్ రాజధాని మనామాలో ప్రవాస కార్మికులకు ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా చేపట్టిన ఫీనా ఖైర్ లో భాగంగా దాదాపు 4 లక్షల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనామా గవర్నర్ షేక్ హిషమ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో భాగంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తము ప్రవాస కార్మికులకు ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశం మానవతా దృక్పధం చాటుతోందన్నారు. బహ్రెయిన్ సమాజంలో భాగమైన విలువలకు ఫీనా ఖైర్ ఓ సంకేతమన్నారు. కష్టాల్లో ఉన్నవారికి తాము సంఘీభావంగా నిలబడతామన్నారు. మరోవైపు కష్టాల్లో ఉన్న వారి ఆకలి బాధ తీర్చేందుకు ఫీనా ఖైర్ చేపట్టాలని ఆదేశించిన జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫాపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజధాని ప్రాంతంలో ప్రతి రోజు ఆహార పొట్లాలను అందించేలా స్వసంచ సంస్థలు, వాలంటీర్లు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







