దుబాయ్:లాక్ డౌన్ నిబంధనల అమలుకు 500 గస్తీ బృందాలు,63 తనిఖీ కేంద్రాల ఏర్పాటు
- May 22, 2020
దుబాయ్:ఈద్ అల్ ఫితర్ సమయంలో కోవిడ్ 19 ప్రోటోకాల్ అమలుకు దుబాయ్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గవర్నరేట్ పరిధిలో దాదాపు 500 గస్తీ బృందాలను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్ధుల్లా ఖలిఫా అల్ మెర్రి తెలిపారు. నిబంధనల ఉల్లంఘించే వారిని పసిగట్టేందుకు గస్తీ బృందాలకు రాడార్లు, కెమెరాల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించని వారికి వందకు వంద శాతం జరిమానాలు విధిస్తామని..నిబంధనల అమలులో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అలాగే గవర్నరేట్ పోలీసులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అధికారులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గవర్నరేట్ పరిధిలోని దాదాపు 46 వలస కార్మికుల శిబిరాల్లో 7 మిలియన్ల ఆహార పొట్లాలను అందించటంలో అధికారులకు సహాయపడిందని ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ చీఫ్ వెల్లడించారు. యూఏఈలోని ప్రవాసీయులకు కూడా తమ దేశంలో అన్ని హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. ప్రవాస కార్మికులకు అన్ని రకాల వైద్య సాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈద్ అల్ ఫితర్ ను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. అదే సమయంలో కరోనాపై విజయానికి భౌతిక దూరం పాటించి యూఏఈ సమాజం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







