RBI మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు..
- May 22, 2020
న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఐ, క్రెడిట్ కార్డు చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుభవార్త చెప్పారు. రుణాలపై మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతో జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మారటోరియం సదుపాయం ఉంటుంది. కాగా గతంలో మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు 3 నెలల పాటు మారటోరియం ప్రకటించగా.. దాన్నిప్పుడు మరో 3 నెలలు పొడిగించారు. లాక్డౌన్ కారణంగా ఇప్పటికీ అనేక మంది ఉద్యోగాలకు వెళ్లకపోవడం, అనేక మంది ఉపాధిని కోల్పోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. అందుకనే మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగించారు.
కాగా మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి బాగా తగ్గిందన్నారు. కరోనా ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందన్నారు. ఈ క్రమంలోనే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ఆ రేటు ప్రస్తుతం ఉన్న 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. అలాగే రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
ఇక మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంతదాస్ తెలిపారు. అలాగే ఆర్థిక రంగం అభివృద్ధికి మరిన్ని ఉద్దీపన చర్యలు చేపడతామన్నారు. అయితే ఆయన ఈ వివరాలను వెల్లడించగానే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూసింది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోయింది. బ్యాంకుల షేర్లు కుప్పకూలాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు