RBI మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు..
- May 22, 2020
న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఐ, క్రెడిట్ కార్డు చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుభవార్త చెప్పారు. రుణాలపై మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతో జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మారటోరియం సదుపాయం ఉంటుంది. కాగా గతంలో మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు 3 నెలల పాటు మారటోరియం ప్రకటించగా.. దాన్నిప్పుడు మరో 3 నెలలు పొడిగించారు. లాక్డౌన్ కారణంగా ఇప్పటికీ అనేక మంది ఉద్యోగాలకు వెళ్లకపోవడం, అనేక మంది ఉపాధిని కోల్పోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. అందుకనే మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగించారు.
కాగా మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి బాగా తగ్గిందన్నారు. కరోనా ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందన్నారు. ఈ క్రమంలోనే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ఆ రేటు ప్రస్తుతం ఉన్న 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. అలాగే రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
ఇక మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంతదాస్ తెలిపారు. అలాగే ఆర్థిక రంగం అభివృద్ధికి మరిన్ని ఉద్దీపన చర్యలు చేపడతామన్నారు. అయితే ఆయన ఈ వివరాలను వెల్లడించగానే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూసింది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోయింది. బ్యాంకుల షేర్లు కుప్పకూలాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







