ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ కన్నుమూత

- May 23, 2020 , by Maagulf
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలో ప్రజలను అలరించిన ప్రముఖ మికిక్రీ కళాకారుడు, సినీనటుడు హరికిషన్(57) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. వందమందికిపై గొంతుకలను అనుకరించే ఆయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

హరికిషన్ స్వస్థలం ఏపీలోని ఏలూరు. బాల్యంలోనే మిమిక్రీపై ఆసక్త పెంచుకున్న ఆయన మిమిక్రీ దిగ్గజం నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో ధ్వన్యనుకరణపై పట్టుసాధించారు. ఎన్టీఆర్‌ , అక్కినేని, చిరంజీవి ల గొంతుకలను బాగా అనుకరించేవారు. వైఎస్ఆర్‌ , కేసీఆర్‌ , వీహెచ్‌ వంటి రాజకీయ నాయకుల గొంతులు కూడా ఆయనకు కొట్టినపిండే. కొన్నాళ్లు స్కూల్లో టీచర్ గా పనిచేసి హరికిషన్ ఆ జీవితం నచ్చక పూర్తి స్థాయి మిమిక్రీ కళాకారుడిగా మారారు.సినిమాల్లో చిన్నచిన్న వేషాలు కూడా వేశారు. టీవీ చానళ్లలో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com